హైదరాబాద్:సాఫ్ట్ వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్టీపీఐ) మరో 12 సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ (సీఓఈ)లను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. 30వ ఫౌండేషన్ డే పురస్కరించుకుని ఎస్టీపీఐ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఓంకార్ రాయ్ మాట్లాడుతూ 12 సీఈఓలను అదనంగా జోడించడానికి ఇటీవలనే అనుమతులు పొందామని, వీటిని త్వరలోనే వీటిని పలు నగరాలలో ప్రారంభించనున్నామన్నారు.
వైజాగ్లో ఇండస్ట్రీ4.0 టెక్నాలజీ సీఓఈ.. బెంగళూరులో హెల్త్ టెక్, బిగ్ డాటా, ఏఐకు సంబంధించిన సీఓఈ ఏఐసీ ఎస్టీపీఐ నెక్ట్స్, అకోలాలో.. వ్యవసాయ సీఓఈలో ఐఓటీ, ఈశాన్య రాష్ట్రాల రాజధాని నగరాలు గ్యాంగ్టక్ లో హెల్త్ కేర్, అగ్రిటెక్లో ఐటీ అప్లికేషన్స్, ఇటా నగర్ లో... డ్రోన్ టెక్ సహా జీఐఎస్ అప్లికేషన్స్.. కొహిమాలో గ్రాఫిక్ డిజైన్ లో ఐటీ అప్లికేషన్, ఐజ్వాల్ లో గేమింగ్.. అగర్తలా లో డాటా ఎనలిటిక్స్.
తమ 30వ ఫౌండేషన్ డే పురస్కరించుకుని డైరెక్టర్ జనరల్ ఓంకార్ రాయ్ మాట్లాడుతూ భారతీయ ఐటీ పరిశ్రమ అవసరాలను తీర్చేందుకు దేశంలో మూడు కేంద్రాలతో కార్యకలాపాలు ఆరంభించిన తాము ఇప్పుడు దేశవ్యాప్తంగా 60 కేంద్రాలను కలిగి ఉన్నామన్నారు.1992లో 17 కోట్ల రూపాయలుగా ఉన్న ఐటీ/ఐటీఈఎస్ ఎగుమతులు 2020–22 నాటికి 5.08 లక్షల కోట్ల రూపాయలకు చేరుకున్నాయన్నారు.