హెచ్ పీవీ టీకాతో గర్భాశయ క్యాన్సర్కు చెక్..అంబేద్కర్ విద్యాసంస్థల్లో అవగాహన సదస్సు

హెచ్ పీవీ టీకాతో గర్భాశయ క్యాన్సర్కు చెక్..అంబేద్కర్ విద్యాసంస్థల్లో అవగాహన సదస్సు
  •  ముఖ్య​అతిథిగా హాజరైన  డా. మెహర్ మేడవరం

ముషీరాబాద్, వెలుగు: హెచ్​పీవీ టీకాతో గర్భాశయ క్యాన్సర్​ను పూర్తిగా నివారించవచ్చని ప్రముఖ డాక్టర్ మెహర్ మేడవరం తెలిపారు.  సోమవారం బాగ్ లింగంపల్లిలోని కాకా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఎడ్యుకేషనల్ ఇన్​స్టిట్యూషన్స్​లో హెచ్​పీవీ టీకాతో క్యాన్సర్ నివారణ అంశంపై అవగాహన సదస్సు జరిగింది. ముఖ్య అతిథిగా అమెరికాకు చెందిన ప్రముఖ వైద్య నిపుణులు, ఐఏఎం‌‌ఏ ఆఫ్ ఇల్లినాయిస్ అధ్యక్షురాలు డా. మెహర్ మేడవరం హాజరై మాట్లాడారు. 

సరైన వయస్సులో హెచ్​పీవీ టీకా వేయించుకుంటే గర్భాశయ క్యాన్సర్​ను పూర్తిగా నిర్మూలించవచ్చని తెలిపారు. ముఖ్యంగా 9 నుంచి 11 ఏండ్ల మధ్య టీకా వేయించుకోవడం అత్యంత ప్రభావవంతమని స్పష్టం చేశారు. విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ ఆరోగ్యానికి సంబంధించిన అపోహలను తొలగించారు.