రకుల్ మూవీ సెట్‌‌పై రాళ్లదాడి

రకుల్ మూవీ సెట్‌‌పై రాళ్లదాడి

లక్నో: టాలీవుడ్ పాపులర్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోన్న ఓ హిందీ సినిమా సెట్ పై రాళ్ల దాడి జరిగింది. హిందీ స్టార్ హీరో జాన్ అబ్రహామ్‌తో అటాక్ అనే సినిమాలో రకుల్ యాక్ట్ చేస్తోంది. అందులో భాగంగా డమ్మీ బాంబ్‌ బ్లాస్టింగ్‌ జరిపారు. షూటింగ్‌‌కు సంబంధించి ముందస్తు జాగ్రత్తలు కూడా తీసుకున్నారు. అయితే మూవీ షూట్ గురించి తెలుసుకున్న గ్రామస్తులు సెట్ వద్దకు చేరుకొని నటీనటులను చూసేందుకు ఎగబడ్డారు. దీంతో సెక్యూరిటీ గార్డులు వారిని అడ్డుకునేందుకు యత్నించారు. దీంతో సీరియస్ అయ్యిన గ్రామస్తులు ఎదురుదాడికి దిగారు. గార్డుల మీదకు రాళ్లు విసిరారు. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో పలువురు సెక్యూరిటీ సిబ్బందికి గాయాలయ్యాయి. హీరోహీరోయిన్లకు ఎలాంటి ఇంజ్యురీస్ అవ్వలేదు.