హైదరాబాద్ కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలో బాలుడిపై వీధికుక్క దాడి

హైదరాబాద్ కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలో బాలుడిపై వీధికుక్క దాడి

జీడిమెట్ల, వెలుగు: కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలో వీధి కుక్కలు చెలరేగిపోతున్నాయి. తాజాగా చింతల్ వెంకటేశ్వరనగర్​లో 7వ తరగతి బాలుడిపై వీధి కుక్క దాడి చేసింది. మెహిత్ చరణ్​(12) శనివారం మధ్యాహ్నం ఇంటి సమీపంలోని కిరాణా షాప్​కు వెళ్లగా, ఓ కుక్క దాడి చేసింది. ఈ ఘటనలో బాలుడి పిక్కలకు తీవ్ర గాయాలు పాలయ్యాయి. అధికారులు పట్టించుకోకపోవడంతో కుత్బుల్లాపూర్​సర్కిల్​పరిధిలో వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా వాటికి టీకాలు వేయడంతోపాటు షెల్టర్లకు తరలించాలని కోరుతున్నారు.