నిజామాబాద్: ప్రభుత్వ స్కూల్ లో కరెంట్ షాక్ తో స్టుడెంట్ మృతి…

నిజామాబాద్: ప్రభుత్వ స్కూల్ లో కరెంట్ షాక్ తో స్టుడెంట్ మృతి…

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. కోటగల్లీ ప్రభుత్వ స్కూల్ లో విద్యుత్ షాక్ తో ఓ విద్యార్ధి చనిపోయాడు. లంచ్ సమయంలో స్కూల్ లో ఆడుకుంటున్న ఆయాన్ ఖాన్.. కింద జారీ పడ్డాడు. లేవడం కోసం పక్కనే ఉన్న కరెంటు తీగను పట్టుకోవడంతో షాక్ తగిలి అక్కడికక్కడే చనిపోయాడు. గతంలో స్కూల్ భవనం శిథిలావస్థతకు చేరిందని.. కరెంటు తీగలు వేలాడుతున్నాయని 3నెలల క్రితమే V6 వరుస కథనాలు ప్రసారం చేసినా…. అధికారులు చొరవ తీసుకోకపోవడంతో ఇప్పుడు ఓ పసి ప్రాణం పోయింది. ఘనపై స్థానికులు, కుటుంబసభ్యులు మండిపడుతున్నారు.