ఎగ్జామ్ ​రాసి ఆన్సర్​ పేపర్​తో ఇంటికెళ్లిన విద్యార్థి

ఎగ్జామ్ ​రాసి ఆన్సర్​ పేపర్​తో ఇంటికెళ్లిన విద్యార్థి
  • ఎగ్జామ్ ​రాసి ఆన్సర్​ పేపర్​తో ఇంటికి!
  • తప్పిదం గుర్తించి బోర్డుకు ఇచ్చి వచ్చిన టెన్త్​విద్యార్థి 
  •  విత్​హెల్డ్​లో రిజల్ట్స్​  న్యాయం చేయాలని వేడుకోలు

మునిపల్లి, వెలుగు : ఈ ఏడాది జరిగిన ఎస్సెస్సీ ఎగ్జామ్స్​ రాసిన ఓ విద్యార్థి భవిష్యత్​ ప్రశ్నార్థకంగా మారింది. ఇన్విజిలేటర్​, సెంటర్​ చీఫ్​ సూపరింటెండెంట్​ నిర్లక్ష్యం, విద్యార్థి తప్పిదంతో మొన్న వెలువడిన ఫలితాల్లో అతడి హాల్​టికెట్​ నంబర్​ విత్​ హెల్డ్​లో వచ్చింది. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం  మల్లికార్జున్ పల్లి  జడ్పీహెచ్​ఎస్​ స్కూల్​కు చెందిన పడమటి మల్లికార్జున్​తన పదో తరగతి పరీక్షలను మునిపల్లి మోడల్ స్కూల్ లో రాశాడు. బయోలాజికల్ సైన్స్ పేపర్ ఎగ్జామ్​రాసిన తర్వాత ఆన్సర్ పేపర్ కట్టి ఇచ్చి రావాల్సింది పోయి క్వశ్చన్ పేపర్  కట్టి ఇన్విజిలేటర్​కు ఇచ్చి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత గమనించిన స్టూడెంట్ తన స్కూల్​ టీచర్ల దృష్టికి  తీసుకెళ్లాడు. వారి సలహా మేరకు మరుసటి రోజు ఆన్సర్​ పేపర్​ను ఎగ్జామ్ సెంటర్ కు తీసుకెళ్తే  హైదరాబాద్​లోని బోర్డు ఆఫ్​ సెకండరీ ఎడ్యుకేషన్​కు తీసుకెళ్లాలని చెప్పారు.

దీంతో వారు చెప్పినట్టే హైదరాబాద్​ వెళ్లి ఇచ్చి వచ్చాడు. ఈ నెల10వ తేదీన ఫలితాలు వెలువడగా అందులో మల్లికార్జున్​ హాల్​టికెట్​నంబర్​ విత్ హెల్డ్​లో వచ్చింది. ఇప్పుడు తనను పాస్ ​చేస్తారో..ఫెయిల్​ చేస్తారో తెలియక కంగారు పడుతున్నాడు. తనకు న్యాయం చేసి భవిష్యత్ అంధకారం కాకుండా చూడాలని వేడుకుంటున్నాడు. ఈ విషయమై ఎగ్జామ్ ​సెంటర్ చీఫ్​ సూపరింటెండెంట్​ కిష్టయ్యను వివరణ కోరగా సైన్స్​పేపర్​కు సంబంధించి రెండు పేపర్లు ఒకే  రోజు రావడంతో స్టూడెంట్ ​రాసిన పేపర్ ను సరిగ్గా చూడలేకపోయామని చెప్పారు.