టీఎస్ సెట్​ వాయిదా వేయండి.. ఓయూ రిజిస్ట్రార్​కు విద్యార్థి సంఘాల వినతి

టీఎస్ సెట్​ వాయిదా వేయండి.. ఓయూ రిజిస్ట్రార్​కు విద్యార్థి సంఘాల వినతి

ఓయూ, వెలుగు: ఈ నెల చివరివారంలో జరగనున్న టీఎస్​ సెట్​ పరీక్షను వాయిదా వేయాలని  విద్యార్థి సంఘాలు కోరాయి.ఈ  మేరకు ఓయూ రిజిస్ట్రార్​ ప్రొఫెసర్​లక్ష్మినారాయణకు సోమవారం వినతి పత్రం అందజేశాయి. గ్రూప్​– 2 పరీక్షలు నవంబరు ఫస్ట్ వీక్ లో ఉండగా, టీఎస్​సెట్​పరీక్షల కారణంగా ఏండ్లుగా చదువుతున్న స్టూడెంట్లు తీవ్రంగా నష్టపోతారని  విద్యార్థి సంఘాల నేతలు పేర్కొన్నారు. 

ఇందుకు సానుకూలంగా స్పందించిన రిజిస్ట్రార్​ పరీక్ష వాయిదా కోసం సంబంధిత అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు విద్యార్థి సంఘాల నేతలు రవి నాయక్, ఆంజనేయులు,  శ్రీను, వికాస్ తెలిపారు.