Valentines Day: మోడీకి బంగారు గులాబీలు గిఫ్ట్

Valentines Day: మోడీకి బంగారు గులాబీలు గిఫ్ట్

వాలెంటైన్స్ డే సందర్భంగా తమ ఇష్టమైనవాళ్లకు పూలు, రకరకాల బహుమతులు ఇచ్చి గ్రీటింగ్స్ చెప్పుకుంటారు. అయితే, సూరత్ లోని ఆరో యూనివర్సిటీకి చెందిన స్టూడెంట్స్ మాత్రం కొంత వెరైటీగా తమ అభిమానాన్ని చాటుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీపై తమ ప్రేమను తెలిపేందుకు 24 క్యారెట్ల బంగారు పూత పూసిన 151 గులాబీల బొకేను గిఫ్ట్ గా ఇచ్చారు.

‘ప్రధాని మోడీ మాకు ఆదర్శం. విద్యార్థుల పట్ల ఆయన భావాలు గొప్పవి. అందుకే వాలెంటైన్స్ డే రోజు ప్రధాని మోడీకి ఈ బంగారు గులాబీలు అందించాం. ఆయన పాలనలో దేశం మిగతా దేశాలకు స్పూర్తిగా ఎదుగుతుంది. అందుకే ఆయన గౌరవానికి సూచనగా బంగారు పుష్పగుచ్ఛాన్ని అందించాలని నిర్ణయించుకున్నాం’ అని యూనివర్సిటీ విద్యార్థులు అన్నారు.