నిజాంపేట మండలంలో బస్సు కోసం స్టూడెంట్ల రాస్తారోకో

నిజాంపేట మండలంలో బస్సు కోసం స్టూడెంట్ల రాస్తారోకో

నిజాంపేట, వెలుగు : గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ మెదక్-–సిద్దిపేట నేషనల్ హైవేపై నిజాంపేట మండలం చల్మేడ కమాన్ వద్ద గురువారం ఏబీవీపీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా స్టూడెంట్స్​​ మాట్లాడుతూ నస్కల్, నందగోకుల్, రాంపూర్, చల్మెడ, కల్వకుంట గ్రామాలకు బస్సు సౌకర్యం లేక రోజూ నడుచుకుంటూ కాలేజీలు, స్కూళ్లకు వెళ్తున్నామని చెప్పారు.

ఆలస్యం కారణంగా  రోజూ క్లాస్​లు మిస్ అవుతున్నామని తెలిపారు. ఆందోళన విషయం తెలుసుకున్న నిజాంపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మెదక్  ఆర్టీసీ డీఎంతో ఫోన్​ లో మాట్లాడి స్టూడెంట్స్​కు నచ్చజెప్పడంతో రాస్తారోకో విరమించారు.