డిగ్రీ, పీజీ రిజల్ట్స్: కాకతీయ యూనివర్సిటీలో ఆందోళన…

డిగ్రీ, పీజీ రిజల్ట్స్: కాకతీయ యూనివర్సిటీలో ఆందోళన…

డిగ్రీ, పీజీ ఫలితాల్లో అవకతవకలు జరిగాయని.. కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. హన్మకొండ నుంచి యూనివర్సిటీ వరకు విద్యార్థులు ర్యాలీగా వెళ్లారు. ఫలితాల్లో గందరగోళం తలెత్తిందంటూ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ముందు ఆందోళనకు దిగారు. మెయిన్ డోర్ అద్దాలు కూడా ధ్వంసమయ్యాయి. దీంతో.. పోలీసులు విద్యార్థులను అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో.. ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఈ సందర్భంగా కొందరు విద్యార్థులకు గాయాలయ్యాయి.