ఖమ్మం టౌన్, వెలుగు : పెండింగ్లోని స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్స్ ను విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ ఖమ్మం డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో గురువారం ఖమ్మం నగర కేంద్రంలోని పాత బస్టాండ్ కమల మెడికల్ వద్ద స్టూడెంట్స్ రోడ్లు ఊడుస్తూ, బిక్షాటన చేస్తూ వినూత్న నిరసన తెలిపారు. .
ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ప్రవీణ్ మాట్లాడుతూ విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. రాష్ట్రంలోని ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు పూర్తిగా కళాశాలలు బంద్ చేసి నాలుగు రోజులు గడుస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు. ఇప్పటికైనా పెండింగ్లోని స్కాలర్ షిప్స్ను వెంటనే విడుదల చేసి, విద్యార్థులు ఉన్నత చదువులకు దూరం కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. లేకపోతే విద్యార్థులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ ఖమ్మం డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు త్రినాథ్ రాజు, ఉపాధ్యక్షుడు లోకేశ్, నాయకులు భరత్, సింధు, సాత్విక, త్రివేణి, శ్రావ్య, నందిని, సింధుజ, ధరణి, త్రివేణి, కావ్య పాల్గొన్నారు.
