
కూకట్పల్లి, వెలుగు: జేఎన్టీయూ పరిధిలోని ఇంజినీరింగ్కాలేజీల్లో ఫీజులు పెంచొద్దని వర్సిటీ స్టూడెంట్స్ప్రొటెక్షన్ ఫోరం డిమాండ్ చేసింది. ఈ మేరకు ఫోరం ఆధ్వర్యంలో మంగళవారం విద్యార్థులు తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు.
ఫీజుల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు మద్దతు తెలుపుతున్నామన్నారు. ఇందుకు అనుగుణంగా రాష్ట్రంలోని ఇంజినీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో యాజమాన్యాలు ఫీజులు పెంచకుండా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.