హైదరాబాద్, వెలుగు: ఇంటర్మీడియెట్లో టాపర్లుగా నిలిచిన స్టూడెంట్స్, ఎంసెట్ ఎగ్జామ్లో కనీసం క్వాలిఫై కూడా కావడం లేదు. ఇలాంటి వారు ఐదుగురో, పదిమందో కాదు.. ఆ సంఖ్య ఏకంగా వేలల్లోనే ఉంటున్నది. ఈ ఏడాది ఎంసెట్ ఇంజినీరింగ్ స్ట్రీమ్ కోసం మొత్తం 1,43,326 మంది అప్లయ్ చేసుకోగా.. 1,19,183 మంది పరీక్షకు హాజరయ్యారు. దీంట్లో 89,734 (75.29శాతం) మంది క్వాలిఫై అయ్యారు.160 మార్కుల కోసం జరిగే ఈ పరీక్షలో 121 నుంచి 160 మార్కులు సాధించిన స్టూడెంట్స్ కేవలం 117 మంది ఉన్నారు. 81–120 మార్కులు వచ్చిన వారు 3,409 మంది ఉండగా, 40–80 మార్కులు స్కోర్ చేసిన వారు 79,201 మంది ఉన్నారు. ఇంతవరకూ బాగానే ఉన్నా, ఇంటర్మీడియెట్లో కాలేజీ టాపర్లుగా నిలిచిన స్టూడెంట్స్చాలామంది ఎంసెట్ ఎగ్జామ్లో క్వాలిఫై కాలేకపోయారు. ఇంటర్లో వెయ్యి మార్కులకు గానూ 900 మార్కులు ఆపై స్కోర్ చేసిన స్టూడెంట్స్సుమారు 5,300 మంది వరకూ కనీసం ఎంసెట్లో అర్హత మార్కులు 40 ( 25శాతం) కూడా సాధించలేకపోయారు. మొత్తం సగానికి పైగా(80 మార్కులు) మార్కులొచ్చింది 3,526 మంది స్టూడెంట్స్ మాత్రమే.
గతేడాది కూడా అంతే…
ఎంసెట్(ఇంజనీరింగ్ స్ట్రీమ్) 2019లో 91,446 మందికి ర్యాంకులు కేటాయించారు. వీరిలో ఎంసెట్లో 121 నుంచి 160 మార్కులు సాధించిన స్టూడెంట్స్ 45 మంది మాత్రమే ఉన్నారు. 80 మార్కులు అంటే సగం మార్కులు సాధించిన వారు 4,343 మందే ఉన్నారు. ఎంసెట్ లో క్వాలిఫై అయ్యే స్టూడెంట్స్ అంతా ఇంటర్ లో 80 % మార్కులు సాధించినవారే ఉంటారని ఆఫీసర్లు చెప్తున్నారు. కానీ 90% మార్కులొచ్చిన స్టూడెంట్స్ఎంసెట్లో 25% మార్కులూ సాధించలేకపోవడం విద్యాప్రమాణాలపై అందరిలో అయోమయం నెలకొన్నది.
సరైన శిక్షణ లేకనే సమస్య
గ్రామీణ ప్రాంత స్టూడెంట్లకు ఎంసెట్ శిక్షణ, మెటిరియల్ అందుబాటులో లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. అర్బన్ ఏరియాల్లో కార్పొరేట్, ప్రైవేటు కాలేజీల్లో పైపైన ఇంటర్ చదువులకు ప్రాధ్యానం ఇచ్చి, మొత్తం ఎంసెట్ పై దృష్టి సారించడంతో ఆ కాలేజీల్లోంచి ఎక్కువ మంది క్వాలిఫై అవుతున్నారు. ఈ వ్యత్యాసం తొలగించేందుకు సర్కారు కాలేజీల్లో కోచింగ్ ఇవ్వాలని 2008 ప్రొఫెసర్ దయారత్నం కమిటీ సూచించినా, ప్రభుత్వం మాత్రం చర్యలు తీసుకోలేదు. కార్పొరేట్ కాలేజీల్లో బట్టీ విధానమూ ఎంసెట్లో ర్యాంకులు రాకపోవడానికి కారణం.
– మధుసూధన్రెడ్డి, ఇంటర్ జేఏసీ చైర్మన్