యూకేలో స్టూడెంట్లకు మ్యాథ్స్ కంపల్సరీ
18 ఏండ్లు వచ్చే వరకూ తప్పదు
పీఎం రిషి సునక్ ఆఫీస్ ప్రకటన
లండన్ : యూకేలో స్టూడెంట్లందరికీ ఇకపై మ్యాథ్స్ అధ్యయనం కంపల్సరీ కానుంది. ఈ ఏడాది నుంచి విద్యార్థులు తమకు18 ఏండ్లు వచ్చేదాకా మ్యాథ్స్ స్టడీ చేయాల్సిందేనని పీఎం రిషి సునక్ కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రతి స్టూడెంట్కు అత్యున్నతమైన ప్రమాణాలతో కూడిన విద్యను అందించడమే తన ప్రాధాన్యమని సునక్ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఆ హామీ అమలు దిశగా ఆయన ప్రభుత్వం అడుగులు వేయనుంది. ‘‘సరైన ప్లానింగ్, కమిట్ మెంట్ తో ప్రపంచంలో అత్యన్నతమైన విద్యా వ్యవస్థను సాధించవచ్చు. ఆ విషయంలో నాకెలాంటి డౌట్ లేదు” అని సునక్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
ప్రస్తుతం యూకేలో 16 నుంచి 19 ఏండ్ల మధ్య సగం మంది మాత్రమే మ్యాథ్స్ చేయగలుగుతున్నారు. ఇక్కడి స్టూడెంట్లలో 60 శాతం మందికి బేసిక్ మ్యాథ్స్ పై పట్టు లేదు.