సింధు,మానసిల విజయం దేశానికే గర్వకారణం: గోపీచంద్

సింధు,మానసిల విజయం దేశానికే గర్వకారణం: గోపీచంద్

పీవీసింధు ప్రపంచ షట్లర్ ఛాంపియన్ గా, పారా షట్లర్ ఛాంపియన్ గా మానసి జోషిల విజయం తనతో పాటు దేశానికే గర్వకారణమన్నారు హెడ్ కోచ్ గోపీచంద్. హైదరాబాద్ రాజ్ భవన్లో జరిగిన సన్మాన కార్యక్రమంలో గోపీ చంద్ మాట్లాడారు. సింధు విజయానికి  పాటు పడిన కోచ్ కిమ్ను అభినందించాలన్నారు. తన బంగారు కలను నిజం చేసినందుకు సింధుకి కృతజ్ఞతలు తెలిపిన గోపీ… పారా షట్లర్ మానసి జోషి శ్రమ, పట్టుదలకు ప్రతీకన్నారు. ఒకేసారి రెండు గోల్డ్ మెడల్స్ దేశానికి రావడం ఆనందాన్ని రెట్టింపు చేసిందన్నారు.