హైదరాబాద్, వెలుగు : గవర్నర్ తమిళి సైను భారత్ బయోటిక్ కో-ఫౌండర్ సుచిత్ర ఎల్లా మంగళవారం రాజ్ భవన్లో కలిశారు. ఇటీవల బైరాన్పల్లి వెళ్లి వస్తుండగా సిద్దిపేట జిల్లా చేర్యాల దగ్గర సంధ్యారాణి అనే మహిళ గవర్నర్ కాన్వాయ్ని ఆపారు. తమిళి సై సంధ్యారాణి ఇంటిని పరిశీలించారు. తనకు ఇల్లు మంజూరు కాలేదని, ముగ్గురు కూతుళ్లతో కలిసి ఉంటున్నానని గవర్నర్కు చెప్పగా, ఆమె చలించిపోయారు.
సంధ్యారాణి పరిస్థితిపై గవర్నర్ ట్వీట్ చేయగా, సుచిత్ర ఎల్లా స్పందించి, పిల్లల చదువుకు సాయం చేస్తానని, సంధ్యకు జినోమ్ వ్యాలీలో జాబ్ ఇస్తామని హామీ ఇచ్చారు. సంధ్య వివరాలను రాజ్ భవన్ అధికారుల నుంచి సుచిత్ర ఎల్లా తీసుకున్నారు.