
హైదరాబాద్, వెలుగు: దక్షిణాది రాష్ట్రాల్లో రాబోయే ఐదేళ్లలో 25 లక్షల మందికి ఉపాధి కల్పించేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో, ఇండస్ట్రీలతో కలసి పనిచేస్తామని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, సదరన్ రీజియన్ ప్రకటించింది. తెలంగాణలో 2027 నాటికి ఐదు లక్షల మందికి జాబ్స్ ఇప్పించేందుకు ప్రయత్నిస్తామని సంస్థ చైర్మన్, భారత్ బయోటెక్ జేఎండీ సుచిత్రా ఎల్లా అన్నారు. 25 లక్షల మంది ఉపాధి కల్పించాలనే టార్గెట్ను చేరుకోవడానికి దక్షిణాది రాష్ట్రాలను పెట్టుబడులకు అనువైనవని ప్రచారం చేస్తామని చెప్పారు. ఇప్పుడున్న బిజినెస్లను విస్తరించడానికి ఇండస్ట్రీలతో కలిసి పనిచేస్తామని చెప్పారు. దక్షిణాది రాష్ట్రాల్లో స్థిరమైన ప్రభుత్వాలు ఉన్నందున వ్యాపారం చేయడం సులువని సుచిత్ర అన్నారు.