అయ్యప్ప మాలతో స్కూల్ కు స్టూడెంట్..అనుమతించని యాజమాన్యం

అయ్యప్ప మాలతో స్కూల్ కు స్టూడెంట్..అనుమతించని యాజమాన్యం
  • ఏబీవీపీ నాయకులు, అయ్యప్ప స్వాములు ఆందోళన

జీడిమెట్ల, వెలుగు: అయ్యప్ప మాల ధరించి వచ్చిన ఓ స్టూడెంట్​ను స్కూల్​ యాజమాన్యం  అనుమతించలేదు. యూనిఫాం లేకుండా రావద్దని చెప్పడంతో ఏబీవీపీ నాయకులు, అయ్యప్ప స్వాములు ఆందోళనకు దిగారు. ఈ ఘటన సుచిత్రలోని షేర్​ ఉడ్​ పబ్లిక్​ స్కూల్​ లో జరిగింది. ఆరో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి అయ్యప్ప మాల ధరించాడు. 

గురువారం మాలధారణలో స్కూల్​కు రాగా, యూనిఫాం లేకుంటే రావద్దంటూ యాజమాన్యం అడ్డుకున్నది. విషయం తెలుసుకున్న ఏబీవీవీ నాయకులు, అయప్పస్వాములు పెద్ద సంఖ్యలో స్కూల్ వద్దకు చేరుకుని ఆందోళన చేశారు. మాలలో ఉన్న స్టూడెంట్​ను యూనిఫామ్​, షూ వేసుకుని రావాలని చెప్పడం బాధాకరమన్నారు. సుప్రీం కోర్టు అదేశాలు ధిక్కరిస్తున్నారని మండిపడ్డారు. పోలీసులు రంగప్రవేశం చేయడం, స్కూల్​ యాజమాన్యం క్షమాపణ చెప్పడంతో గొడవ సద్దుమనిగింది.