రేపట్నుంచి జూన్ 11 వరకు స్కూళ్లకు వేసవి సెలవులు

రేపట్నుంచి జూన్ 11 వరకు స్కూళ్లకు వేసవి సెలవులు

హైదరాబాద్: రాష్ట్రంలోని స్కూళ్లకు రేపటి నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. ఇవాళ ఎస్ఏ 2 పరీక్షలు ముగిశాక రేపటి నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు మొదలవుతాయని పాఠశాల విద్యా శాఖ ప్రకటించింది. ఒకటి నుండి 9 వ తరగతి విద్యార్ధులకు సెలవులు ఉంటాయి. 
రేపటి నుండి10 వ తరగతి విద్యార్థులకు రివిజన్ తరగతులు  ప్రారంభం అవుతాయి. ప్రతి రోజు ఒక టీచర్ స్కూల్ కు హాజరై పదో తరగతి విద్యార్ధులకు రివిజన్ క్లాసులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ అదేశాలు జారీ చేసింది. 
 

 

ఇవి కూడా చదవండి

సోషల్ మీడియాలో వైరల్ గా మారిన స్టూడెంట్ ఆన్సర్

టీచర్ నిర్వాకం..స్కూల్కు 20 లక్షల బిల్లు

ఇబ్రహీంపట్నం ఏసీపీ బాలకృష్ణ రెడ్డి సస్పెన్షన్