- ఇయ్యాల సాయంత్రం 4 నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్,వెలుగు: ట్యాంక్ బండ్పై సండే ఫండే ప్రోగ్రామ్ ఇయ్యాల్టి నుంచి మళ్లీ షురూ కానుంది. ప్రతి ఆదివారం సాయంత్రం ట్యాంక్ బండ్పై జరిగే ఈ ప్రోగ్రామ్ ను కరోనా థర్డ్ వేవ్ ఒమిక్రాన్ నేపథ్యంలో గతేడాది డిసెంబర్లో ప్రభుత్వం నిలిపివేసింది. వజ్రోత్సవాల్లో భాగంగా హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో ‘సండే ఫండే 2.0’ పేరుతో ట్యాంక్ బండ్ పై మళ్లీ ఈ ప్రోగ్రామ్ను నిర్వహించనున్నారు. షాపింగ్, ఫుడ్ స్టాల్స్, ఫైర్ వర్క్స్ షోను ఏర్పాటు చేయనున్నారు. ట్యాంక్ బండ్ పై సాయంత్రం 4 నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని పోలీసులు తెలిపారు.