 
                                    న్యూఢిల్లీ: స్వదేశంలో జరుగుతోన్న ఉమెన్స్ వరల్డ్ కప్లో అతిథ్య ఇండియా ఫైనల్కు దూసుకెళ్లింది. సెమీస్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాను 5 వికెట్ల తేడాతో చిత్తు చేసి సగర్వంగా భారత్ ఫైనల్కు చేరుకుంది. ఇండియా ఫైనల్కు వెళ్లిందంటే కారణం జెమీమా రోడ్రిగ్సే. ఇందులో ఎలాంటి సందేహాం అక్కర్లేదు. కళ్లముందు కొండంత లక్ష్యం.. మరోవైపు ఓపెనర్లు త్వరగా ఔట్ అయ్యారు.. ఈ దశలో క్రీజులోకి వచ్చిన జెమీమా అసాధారణ పోరాట పటిమ కనబర్చింది. మహిళల క్రికెట్లోనే బలమైన బౌలింగ్ లైనప్ కలిగిన ఆస్ట్రేలియాపై చివరి వరకు క్రీజులో నిలబడి వీరోచిత సెంచరీ చేసింది. జెమీమా చిరస్మరణీయ ఇన్సింగ్స్తో ఇండియా ఫైనల్ పోరుకు దూసుకెళ్లింది.
ఓపిక లేకున్నా జట్టు విజయం కోసం శరీరంలోని బలాన్నంతా కూడగట్టుకుని చివరి వరకు క్రీజులో నిలబడి ఇండియాకు అపూర్వ విజయం అందించిన జెమీమాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ క్రమంలోనే టీమిండిమా మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ జెమీమాపై పొగడ్తలు కురిపించారు. ఆస్ట్రేలియా వంటి బలమైన ప్రత్యర్థిపై జెమీమా ఇన్సింగ్స్ అద్భుతమని కొనియాడారు.
తీవ్ర ఒత్తిడిలో జెమీమా చూపించిన పోరాటం అసాధారణమని ప్రశంసించారు. ఈ సందర్భంగా సునీల్ గవాస్కర్ ఒక వాగ్ధానం చేశారు. ఉమెన్స్ వరల్డ్ కప్ టైటిల్ ఇండియా గెలిస్తే.. జెమీమా రోడ్రిగ్స్తో కలిసి ఒక పాట పాడుతానని చెప్పారు. ఆమె గిటార్ వాయిస్తుంటే తాను పాట పాడుతానని అన్నారు.
జెమీమాకు ఇష్టం ఉంటనే ఈ పని చేస్తానన్నారు. గతంలో ఓసారి బీసీసీఐ అవార్డుల కార్యక్రమం సందర్భంగా తాము ఇలా చేశామని గవాస్కర్ గుర్తు చేశారు. జెమీమా గిటార్ వాయిస్తుంటే.. తాను పాడానని వివరించారు. టీమిండియా వరల్డ్ కప్ గెలిస్తే.. మరోసారి ఆ సీన్ రిపీట్ చేయాలనుకుంటున్నానని గవాస్కర్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

 
         
                     
                     
                    