శివ్వంపేట మండలంలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న సునీతారెడ్డి, మదన్​ రెడ్డి

శివ్వంపేట మండలంలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న  సునీతారెడ్డి, మదన్​ రెడ్డి

శివ్వంపేట, వెలుగు : మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలో బుధవారం జరిగిన వివిధ అభివృద్ధి,  సంక్షేమ కార్యక్రమాల్లో రాష్ట్ర మహిళా కమిషన్​ చైర్​ పర్సన్​ సునీతారెడ్డి, నర్సాపూర్​ ఎమ్మెల్యే మదన్​ రెడ్డి కలిసి పాల్గొన్నారు. గోమారంలో రూ.1.76 కొట్లతో చేపట్టే సీసీ రోడ్ల, అండర్​ గ్రౌండ్​ డ్రైనేజీ, గొల్ల కురుమ, ఎస్సీ, ముదిరాజ్, మైనార్టీ కుల సంఘాల భవనాలకు శంకుస్థాపన చేశారు. గోమారంలో  మహిళలకు బతుకమ్మ చీరలు, యువకులకు క్రీడా కిట్లు  పంపిణీ చేశారు. చండి నుండి అనంతరం చౌరస్తా వరకు చేపట్టేఏ బీటీ రోడ్డు శంకుస్థాపన శిలాఫలకంపై నవాపేట్ సర్పంచ్ అశోక్ రెడ్డి పేరు పెట్టకపోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
 

ఎమ్మెల్యే మదన్ రెడ్డి, మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి ముందే కాంట్రాక్టర్, ఆఫీసర్లను నిలదీశారు. కార్యక్రమంలో  గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్, ఎంపీపీ హరికృష్ణ,  జడ్పీటీసీ మహేశ్​గుప్తా, జడ్పీ కోఆప్షన్ మెంబర్ మన్సూర్  సర్పంచ్ లావణ్య మాదవరెడ్డి పాల్గొన్నారు.