దుబాయ్: ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన ఇవాళ్టి మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ భారీ స్కోర్ చేసింది. ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 219 రన్స్ చేసింది. రైజర్స్ కు మంచి ప్రారంభం దక్కింది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్(66), వృద్ధిమాన్ సాహా(87) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. పవర్ ప్లేలో వికెట్ నష్టపోకుండా 77 రన్స్ చేసింది హైదరాబాద్.
ఈ జోడీ 108 రన్స్ తర్వాత వార్నర్ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత సాహా అద్భుతమై షాట్లతో జోష్ పెంచాడు. ఢిల్లీ పటిష్టమైన బౌలింగ్ లోనూ సిక్సర్లు, ఫోర్లు కొడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. 15వ ఓవర్ లో సాహా ఔట్ అయినప్పటికీ అప్పటికే హైదరాబాద్ స్కోర్ 150 దాటింది. ఆ తర్వాత మనీష్ పాండే(44), కేన్ విలియమ్సన్(11) కూడా చెలరేగడంతో రైజర్స్ స్కోర్ ఈజీగా 200 మార్క్ దాటింది.
ఢిల్లీ బౌలర్లలో నోర్ట్జే ,అశ్విన్ చెరో వికెట్ తీశారు.
దీంతో కీలక మ్యాచ్ లో బ్యాట్స్ మెన్లు రాణించడంతో భారీ స్కోర్ చేసిన హైదరాబాద్ కు.. మరి బౌలింగ్ లోనూ అలాగే సత్తా చాటితే విజయం హైదరాబాద్ దేనంటున్నారు స్పోర్ట్స్ విశ్లేషకులు.
We end at 219/2 after our 20 overs quota! ?
220 runs to defend! ?#SRHvDC #OrangeArmy #KeepRising pic.twitter.com/h01lYub69U
— SunRisers Hyderabad (@SunRisers) October 27, 2020