హైదరాబాద్ : IPL సీజన్-12లో భాగంగా సోమవారం ఉప్పల్ స్టేడియం లో SRH తో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచింది పంజాబ్. కెప్టెన్ అశ్విన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. సొంతగడ్డపై లీగ్ దశలో కేన్ విలియమ్స్ కెప్టెన్సీలోని సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఇదే ఆఖరి మ్యాచ్. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తో సన్ రైజర్స్ అమీతుమీ తేల్చుకోనుంది. రెండు టీమ్స్ కూడా ప్లేఆఫ్స్ రేసులో ఉన్నందున మ్యాచ్ రసవత్తరంగా సాగనుంది. రెండు జట్లకు ఇది చావోరేవో మ్యాచ్ కావడం విశేషం.
పాయింట్ల పట్టికలో సన్ రైజర్స్ నాలుగో స్థానంలో ఉండగా..పంజాబ్ ఐదో స్థానంలో ఉంది. 11 మ్యాచ్ ల్లో రెండు టీమ్స్ 10 పాయింట్లతో సమానంగా ఉన్నాయి. సీజన్ ఆరంభం నుంచి ఒంటిచేత్తో మ్యాచ్ లను గెలిపిస్తున్న హార్డ్హిట్టర్ డేవిడ్ వార్నర్కు ఇదే ఆఖరి మ్యాచ్. ఆస్ట్రేలియా వరల్డ్ కప్ టీమ్తో చేరి ప్రత్యేక శిక్షణలో పాల్గొనేందుకు అతడు టోర్నీని వీడనున్నాడు. దీంతో ఇవాళ్టి మ్యాచ్ లో వార్నర్ చెలరేగి ఫినిషింగ్ టచ్ ఇవ్వడ్ కన్ఫమ్ అంటున్నారు. తర్వాతి మ్యాచ్ ల్లో వార్నర్ స్థానంలో మార్టిన్ గప్టిల్ ఓపెనర్ గా రానున్నాడు.
టీమ్స్ వివరాలు ఇలా ఉన్నాయి..
A look at the Playing XI for #SRHvKXIP pic.twitter.com/5Gk3sePxtE
— IndianPremierLeague (@IPL) April 29, 2019