షార్జా: ఐపీఎల్ సీజన్-13లో భాగంగా మంగళవారం షార్జా వేదికగా ముంబైతో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచింది హైదరాబాద్. కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. హైదరాబాద్ కు కీలకమైన ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలవాలనే కాన్ఫిడెన్స్ తో టీమ్ బరిలోకి దిగుతున్నట్లు తెలిపాడు వార్నర్. ముంబై ఈ మ్యాచ్ లో కొన్ని మార్పులు చేసింది. తొడకండరాల గాయంతో గత కొన్ని మ్యాచ్లకు దూరమైన ముంబై కెప్టెన్ రోహిత్ మళ్లీ జట్టు పగ్గాలు చేపట్టాడు. ముంబై పేసర్లు బుమ్రా, ట్రెంట్ బౌల్ట్కు విశ్రాంతినిచ్చినట్లు రోహిత్ తెలిపాడు. అభిషేక్ శర్మ స్థానంలో ప్రియం గార్గ్ను తుది జట్టులోకి తీసుకున్నట్లు తెలిపాడు హైదరాబాద్ కెప్టెన్ వార్నర్.
టీమ్స్
Match 56. Sunrisers Hyderabad XI: D Warner, W Saha, M Pandey, K Williamson, P Garg, A Samad, J Holder, R Khan, S Nadeem, S Sharma, T Natarajan https://t.co/zV58wrXXuf #SRHvMI #Dream11IPL #IPL2020
— IndianPremierLeague (@IPL) November 3, 2020
Playing XI: Rohit (C), Quinny (WK), Ishan, Surya, Tiwary, Pollard, Krunal, Coulter-Nile, Pattinson, Chahar, Dhawal#OneFamily #MumbaiIndians #MI #Dream11IPL #SRHvMI
— Mumbai Indians (@mipaltan) November 3, 2020