
‘మహానటి’ తర్వాత ప్రెస్టీజియస్ ప్రాజెక్టులు తప్ప ఏది పడితే అది చేయడం లేదు కీర్తి సురేష్. ఇంకా చెప్పాలంటే హీరోయిన్ ఓరియెంటెడ్ రోల్స్ వైపు ఎక్కువ మొగ్గు చూపుతోంది. మిస్ ఇండియా, పెంగ్విన్, గుడ్ లక్ సఖీ లాంటివన్నీ ఆమె చుట్టూ తిరిగే కథలే. అలాగని రెగ్యులర్ కమర్షియల్ సినిమాలనూ పక్కన పెట్టేయలేదు. మోహన్లాల్తో ‘మరాక్కర్’, అజయ్ దేవగన్తో ‘మైదాన్’, నితిన్తో ‘రంగ్దే’ చిత్రాలు చేస్తోంది. ఇవన్నీ ఒకెత్తు, ఇప్పుడు వచ్చిన చాన్స్ మరొకెత్తు. సూపర్ స్టార్ రజినీకాంత్ నెక్స్ట్ సినిమాలో ఆమే హీరోయిన్.
రజినీ హీరోగా శివ రూపొందించనున్న మూవీలో ఫిమేల్ లీడ్గా కీర్తిని సెలెక్ట్ చేసినట్లు దర్శక నిర్మాతలు ప్రకటించారు. ఈ ప్రాజెక్టు గురించి కీర్తి కూడా ఉత్సాహంగా ట్వీట్ చేసింది. ‘నా జర్నీలో ఇదో మ్యాజికల్ మైల్ స్టోన్. రజినీకాంత్ సర్తో స్క్రీన్ పంచుకోబోతున్నాను. నా జీవితంలో ఇదొక గొప్ప అనుభవం, జ్ఞాపకం. థాంక్యూ శివగారూ’ అంటూ సంతోషాన్ని వెలిబుచ్చింది కీర్తి. అయితే ఈ యేడు ‘మన్మథుడు 2’లో కొద్ది క్షణాల పాటు తప్ప వెండితెర మీదే మెరవని కీర్తి.. వచ్చే యేడు ఆరేడు సినిమాలతో రానుండటం విశేషమే.