సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ‘SSMB28’ అనే వర్కింగ్ టైటిల్ తో క్రేజీ ప్రాజెక్టు తెరకెక్కుతోంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇవాళ హైదరాబాద్ లో ప్రారంభమైంది. తాజా ఈ మూవీ షూటింగ్ కు సంబంధించిన వర్కింగ్ స్టిల్ ను వదిలారు చిత్రం బృందం. లొకేషన్ లో మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్లు సెట్స్పై నెక్ట్స్ షాట్ గురించి చర్చిస్తున్నట్లు స్టిల్ లో కనిపిస్తోంది. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక–హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్ .రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.
మహేష్, త్రివిక్రమ్ కాంబోలో ఇంతకుముందు వచ్చిన అతడు, ఖలేజా వంటి మూవీలు భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ మూడో చిత్రం అన్ని కమర్షియల్ హంగులతో కూడిన ఎపిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోంది. మహేష్ బాబును మునుపెన్నడూ చూడని క్యారెక్టర్లో ప్రజెంట్ చేయడానికి త్రివిక్రమ్ తన కథను రాశాడు. సూపర్ స్టార్ పొడవాటి జుట్టు, గడ్డంతో మాస్ అవతార్లో కనిపించనున్నారు. ఇందులో మహేష్ సరసన మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ పూజా హెగ్డే కథానాయిక నటిస్తోంది. ఈ చిత్రం 2023 ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.
నటీనటులు: సూపర్ స్టార్ మహేష్ బాబు, పూజా హెగ్డే
సాంకేతిక సిబ్బంది:
రచయిత, దర్శకుడు: త్రివిక్రమ్ శ్రీనివాస్
నిర్మాత: సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు)
బ్యానర్: హారిక & హాసిని క్రియేషన్స్
సంగీతం: ఎస్ థమన్
DOP: PS వినోద్
ఎడిటర్: నవీన్ నూలి
కళ: ఏఎస్ ప్రకాష్