వ్యాక్సిన్ తీసుకోవాలని ఏ వ్యక్తిని బలవంతం చేయొద్దని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. బహిరంగ ప్రదేశాలకు టీకా తీసుకోని వారిని అనుమతించవద్దన్న షరతు పెట్టకూడదంది. ప్రజల కోసం కొత్త పాలసీని రూపొందించి ఆంక్షలు విధించాలని తెలిపింది. కొన్ని రాష్ట్రాలు వ్యాక్సిన్ తీసుకోని వారిని అనుమతించకపోవడం... సమంజసం కాదని పేర్కొంది. వ్యాక్సిన్ వల్ల కలిగే దుష్ప్రభావాలకు సంబంధించిన డేటాను బహిర్గతం చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. వ్యాక్సిన్ తీసుకోని వారిపై రాష్ట్రాలు విధించే ఆంక్షలను పునరాలోచించుకోవాలని స్పష్టం చేసింది.
మరిన్ని వార్తల కోసం