పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంలో.. ‘మేఘా’పై నాగం పిటిషన్ను కొట్టేసిన సుప్రీం

పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంలో.. ‘మేఘా’పై నాగం పిటిషన్ను కొట్టేసిన సుప్రీం

న్యూఢిల్లీ: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో అక్రమాలపై సీబీఐ దర్యాప్తు చేయాలని నాగం జనార్దన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది. హైకోర్టు ఆదేశాలలో జోక్యం చేసుకోలేమని అత్యున్నత ధర్మాసనం స్పష్టం చేసింది. జస్టిస్ బివి.నాగరత్న,  జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం బుధవారం ఈ పిటిషన్పై విచారణ జరిపింది. నాగం తరపున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో పెద్ద మోసం జరిగిందని, ప్రభుత్వ ఖజానాకు 2వేల 426 కోట్ల రూపాయల నష్టం జరిగిందని వాదించారు. 

ప్రభుత్వం ఆమోదించిన ప్రకారం 65 శాతం పంపులు, మోటార్ల కోసం బీహెచ్ఈఎల్కు చెల్లింపులు చేయాలని, 35 శాతం సివిల్ వర్క్స్కు, మేఘాకు చెల్లింపులు చేయాలని ప్రశాంత్ భూషణ్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కానీ.. అంతర్గత ఒప్పందం ప్రకారం బీహెచ్ఈఎల్కు చెల్లింపులను 65 శాతం నుంచి 20 శాతానికి తగ్గించారని, మేఘాకు 80 శాతం చెల్లింపులు జరిగాయని.. 65:35 నుంచి 20:80కు ఎలా మారిందని ప్రశాంత్ భూషణ్ పాయింట్ లేవనెత్తారు. ఇందులో భారీ ఎత్తున అవినీతి జరిగిందని సుప్రీంలో వాదనలు వినిపించారు.

ALSO READ | వక్ఫ్ ఒక ట్రస్ట్.. ముస్లిం మతంలో భాగం కాదు : సుప్రీంలో కేంద్రం

‘మేఘా’ తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్గీ వాదించారు. తెలంగాణ హైకోర్టులో దీనికి సంబంధించిన 5 పిటిషన్లు కొట్టివేశారని, ఇందులో ఎలాంటి ఫ్రాడ్ జరగలేదని కోర్టు స్పష్టం చేసిందని సుప్రీం కోర్టుకు చెప్పారు. సీవీసీ కూడా ఇందులో ఏమి లేదని తేల్చిందని, ఎస్టిమేషన్ పెంచడాన్ని తప్పు పడుతున్నారని రోహిత్గీ వాదించారు. బీహెచ్ఈఎల్ కూడా ఇందులో ఫిర్యాదు చేయలేదని, ఏదో ఒక డాక్యుమెంట్ తెచ్చి కేసులు వేస్తున్నారని సుప్రీం కోర్టులో వాదించారు. ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీం కోర్టు నాగం జనార్దన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను కొట్టేసింది.