టెట్రా ప్యాక్‌ల్లో వోడ్కా అమ్మకాలపై సుప్రీం కోర్టు ఆగ్రహం

టెట్రా ప్యాక్‌ల్లో వోడ్కా అమ్మకాలపై సుప్రీం కోర్టు ఆగ్రహం

ఢిల్లీ: టెట్రా ప్యాక్‌లు, సాచెట్ల వంటి గుర్తించలేని ప్యాకేజీలలో మద్యం (వోడ్కా) అమ్మకాలను.. వోడ్కా నిషేధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేసింది. ఈ విషయంలో కేంద్రం స్పందనను కోరింది. ఇటువంటి ప్యాకేజింగ్ వినియోగదారులను తప్పుదోవ పట్టించి, మైనర్ల మద్యపానాన్ని ప్రోత్సహించగలదని పిటిషనర్ సుప్రీం కోర్టుకు వివరించారు.

భారత ప్రధాన న్యాయమూర్తి సూర్య కాంత్, జస్టిస్ జయమల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం.. 'కమ్యూనిటీ ఎగైనెస్ట్ డ్రంకెన్ డ్రైవింగ్' అనే NGO దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై కేంద్రానికి, పలు రాష్ట్రాల ఎక్సైజ్ శాఖలకు నోటీసులు జారీ చేసింది. ఇది చాలా మోసపూరితమైందని ప్రధాన న్యాయమూర్తి కాంత్ వ్యాఖ్యానించారు.

పిటిషనర్ల తరఫున హాజరైన న్యాయవాది విపిన్ నాయర్ మాట్లాడుతూ.. ఇలాంటి ఆల్కహాల్ ఉత్పత్తులపై స్పష్టమైన హెచ్చరికలు ఉండవని, వాటి ప్యాకేజింగ్ కూడా పండ్ల రసాల మాదిరిగా ఉంటుందని సుప్రీం కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పొగాకు ఉత్పత్తులపై ఉన్నట్టుగా.. వీటి ప్యాకెట్లపై ఎలాంటి హెచ్చరిక ఉండదని, ఈ ప్యాక్‌లు పండ్ల రసాలలా కనిపిస్తాయి.


►ALSO READ | 59 ఏండ్ల తర్వాత ఇదే ఫస్ట్ టైమ్.. విజయ్ కేబినెట్‎లోకి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

కానీ వాటిలో ఆపిల్ చిత్రాలు, చిల్లీ మ్యాంగో వోడ్కా వంటి లేబుల్స్‌తో వోడ్కా ఉంటుందని నాయర్ కోర్టుకు తెలిపారు. అటువంటి ప్యాకేజింగ్‌లో మద్యం అమ్మకాలను నిషేధిస్తూ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఒకే విధమైన విధానాన్ని రూపొందించాలని కేంద్రాన్ని ఆదేశించాలని పిటిషనర్ కోర్టును కోరారు. ఇదిలా ఉండగా.. ఉత్తరప్రదేశ్లో ఈ తరహా వోడ్కా అమ్మకాలు విరివిగా జరుగుతున్నాయి.