
న్యూఢిల్లీ: కమల్ హాసన్, మణిరత్నం కాంబోలో తెరకెక్కిన ‘థగ్ లైఫ్’ సినిమాను కర్ణాటకలో విడుదల చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ సినిమాపై కర్ణాటకలో నిషేధం విధించినందుకు కర్ణాటక ప్రభుత్వంపై అత్యున్నత న్యాయస్థానం మండిపడింది. ‘థగ్ లైఫ్’ సినిమాను అడ్డుకుంటామని కన్నడ సంఘాలు చేసిన బెదిరింపులపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సినిమాను అడ్డుకుంటామని, ప్రదర్శిస్తే థియేటర్లను తగలబెడతామని హెచ్చరించే హక్కు ఏ సంఘాలకూ లేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.
The Supreme Court on Tuesday (June 17) expressed concerns over the "extra-judicial ban" on the screening of Tamil feature film Thug Life, starring Kamal Haasan and directed by Mani Ratnam, in Karnataka.
— Live Law (@LiveLawIndia) June 17, 2025
Read more: https://t.co/JrpimZRRZp #SupremeCourtofIndia #ThugLife #Karnataka… pic.twitter.com/l0pb8LrVeO
కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలను వ్యాఖ్యలతో ఎదుర్కోవాలని, ఎవరి రాతల పైన అయినా అభ్యంతరాలుంటే రాతలతో ఎదుర్కోవాలని.. అంతేకానీ ప్రదర్శనకు సెన్సార్ బోర్డ్ నుంచి అనుమతి పొందిన సినిమాను అడ్డుకుంటామని బెదిరించడం సమంజసం కాదని సుప్రీం కోర్టు జస్టిస్ ఉజ్జల్ భూయన్, జస్టిస్ మన్మోహన్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. చట్టంలో ఉన్న రూల్స్ ప్రకారం CBFC సర్టిఫికెట్ ఇచ్చిన సినిమాను తప్పనిసరిగా విడుదల చేయాలని, ‘థగ్ లైఫ్’ సినిమా విడుదలకు కర్ణాటక ప్రభుత్వం సహకరించాలని సుప్రీం కోర్టు సూచించింది. ‘థగ్ లైఫ్’ సినిమాను తప్పనిసరిగా చూడాలని తాము ఆదేశాలు ఇవ్వడం లేదని అయితే సినిమాను కర్ణాటకలో తప్పనిసరిగా విడుదల చేయాలని జస్టిస్ మన్మోహన్ కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించారు.
►ALSO READ | ‘స్పెషల్ ఓపీఎస్2’ ట్రైలర్ రిలీజ్.. స్పై యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ అభిమానులకు పండగే
తమిళ్ నుంచే కన్నడ భాష పుట్టిందని కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు కర్ణాటకలో వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే. కర్ణాటకలో ‘థగ్ లైఫ్’ విడుదలకు కమల్ చేసిన ఈ వ్యాఖ్యలు అవాంతరం కలిగించాయి. కన్నడ భాషా సంఘాలతో పాటు కమల్ చేసిన వ్యాఖ్యలను కేఎఫ్సీసీ తప్పుబట్టింది. దీంతో.. కర్ణాటకలో ‘థగ్ లైఫ్’ విడుదల నిలిచిపోయింది. కమల్ హాసన్ నుంచి కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్తో(KFCC) పాటు కర్ణాటక హైకోర్టు కూడా క్షమాపణ అడిగినప్పటికీ కమల్ ససేమిరా అన్నారు. తామే కర్ణాటకలో ‘థగ్ లైఫ్’ విడుదల చేయడం లేదని ప్రకటించారు. జూన్ 5, 2025న ప్రపంచవ్యాప్తంగా కమల్ కొత్త సినిమా విడుదలైనప్పటికీ కర్ణాటకలో మాత్రం విడుదల చేయలేదు. ‘థగ్ లైఫ్’ మేకర్స్ సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో కర్ణాటకలో ‘థగ్ లైఫ్’ విడుదలకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.