
ఓటీటీలో వచ్చే స్పై యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్లకు చూడటం కోసం ఓ స్పెషల్ ఫ్యాన్ బేస్ ఎప్పుడూ రెడీగా ఉంటుంది. వాళ్లందరి చూపు ఇప్పుడు ‘స్పెషల్ ఓపీఎస్2’ సిరీస్పై ఉంది. హిమ్మత్ సింగ్ అనే పాత్రలో కేకే మీనన్ లీడ్ రోల్లో నటించాడు. కరణ్ థాకర్, వినయ్ పాఠక్, విపుల్ గుప్త కీలకపాత్రలు పోషించారు. నీరజ్ పాండే, శివమ్ నాయర్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ ఫ్రాంచైజీలో వచ్చిన ఫస్ట్ సీజన్తోపాటు ‘స్పెషల్ ఓపీఎస్ 1.5: ది హిమ్మత్ స్టోరీ’లో వచ్చిన నాలుగు ఎపిసోడ్స్ ఇంప్రెస్ చేశాయి.
ఈ నేపథ్యంలో రాబోయే సీజన్పై అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ట్రైలర్ను విడుదల చేశారు. గతంలో ఉన్న నటీనటులతో పాటు ఈసారి ప్రకాష్ రాజ్, తాహిర్ రాజ్ బాసిన్, సయామీఖేర్, ముజామిల్ ఇబ్రహీం, టాటా రాయ్ చౌదరి యాడ్ అయ్యారు. డా.భార్గవ్ అనే టాప్ సైంటిస్ట్ కిడ్నాప్తో ట్రైలర్ మొదలైంది. భారతదేశంలోని యూపీఐ యూజర్స్ డేటాబేస్ లక్ష్యంగా ఈ కిడ్నాప్ జరుగుతుంది. సైబర్ వార్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ప్రపంచానికి ఏర్పడే ముప్పుతో హిమ్మత్ సింగ్ అండ్ టీమ్ ఎలా పోరాడారు అనేది ఈసారి చూపించబోతున్నట్టు అర్థమవుతోంది. సైబర్ వార్ గెలిచే వాళ్లదే ఈసారి విజయం లాంటి డైలాగ్స్ ఆసక్తికరంగా ఉన్నాయి. జులై 11 నుంచి జియో హాట్ స్టార్లో ఇది స్ట్రీమింగ్ కాబోతోంది.