బాల్క సుమన్​ గూండాలతో బెదిరిస్తుండు : సురేశ్​యాదవ్

బాల్క సుమన్​ గూండాలతో బెదిరిస్తుండు :   సురేశ్​యాదవ్

కోల్​బెల్ట్​, వెలుగు: చెన్నూర్​ బీఆర్ఎస్​అభ్యర్థి బాల్క సుమన్ ​గూండాలతో బెదిరిస్తున్నాడని ఓయూ జేఏసీ చైర్మన్​ సురేశ్​యాదవ్​ ఆరోపించారు. శుక్రవారం ఆయన మంచిర్యాల జిల్లా జైపూర్​ మండలం వేలాలలో బీఆర్ఎస్​కు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. సుమన్ ​చదివిన ఓయూ నుంచే తాను కూడా ఉద్యమం చేశానన్నారు. అతడి లెక్క తన మీద కూడా వంద కేసులు నమోదయ్యాయని, కానీ వేయి కోట్లు మాత్రం లేవన్నారు.

కేసీఆర్ ​తెలంగాణను తాగుబోతుల రాష్ట్రంగా మార్చాడన్నారు. సుమన్ ​నకిలీ లిక్కర్ తో యువతను మద్యానికి బానిసలుగా మార్చుతున్నాడని ఫైర్​అయ్యారు. ఈసారి కారుకు పంక్చర్​ చేయకుంటే తెలంగాణ బిడ్డల భవిష్యత్తు ఆగమవుతుందని హెచ్చరించారు. బీఆర్ఎస్​ను ఓడిస్తే.. నిరుద్యోగ యువత కాళ్లు కడిగి నెత్తిన జల్లుకుంటానన్నారు.