
కరోనా వైరస్ తో వ్యక్తిగత పరిశుభ్రత కు ఉపయోగించే ఉత్పత్తుల అమ్మకాలు భారీ ఎత్తున జరుగుతున్నట్లు తెలుస్తోంది. వైరస్ నుంచి రక్షించుకునేందుకు శాని టైజర్లు, సబ్బులను వినియోగిస్తున్నారు. దీంతో వాటి డిమాండ్ పెరిగినట్లు హిందూస్థాన్ యూనివర్ లిమిటెడ్ తెలిపింది. కరోనా వైరస్ మహమ్మారి నుంచి తమని తాము రక్షించుకునేందుకు హ్యాండ్ వాష్, డిటర్జెంట్లు, ఫ్లోర్ క్లీన్ చేసే ఉత్పత్తుల్ని కొనుగోలు చేస్తున్నారని, బెంచ్ మార్క్ ఎన్ఎస్ఇ నిఫ్టీ 50 ఇండెక్స్ లో ట్రేడ్ అవుతూ 14% కంటే ఎక్కువ లాభాల్ని గడించిందని తెలిపింది.
హిందుస్థాన్ యూనివర్ లిమిటెడ్ ఉత్పత్తుల్ని 43మందిలో 30 కొనుగోలు చేస్తున్నారని మరో 12మంది తమ ఉత్పత్తుల్ని కొనుగోలు చేసేందుకు ఇంట్రస్ట్ చూపుతున్నారని చెప్పింది.
కరోనా వైరస్ ను అడ్డుకునేలా ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు తీసుకుంటుంటే. హ్యాండ్ వాష్, శానిటైజర్, టిష్యూ పేపర్ ఉత్పత్తలు కావాలంటూ ఆయా నగరాల ప్రజలు కోరుకుంటున్నట్లు చెప్పిన
హిందుస్థాన్ యూనివర్.. గ్లెన్మార్క్ ఫార్మా నుంచి మహిళల పరిశుభ్రత కోసం భారీగా ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించింది
కరోనా వైరస్ తో ప్రజల్లో వ్యక్తిగత పరిశుభ్రత పెరిగిందని, దీంతో ఉత్పత్తులకు డిమాండ్ పెరిగినట్లు ఐసిఐసిఐ సెక్యూరిటీస్ లిమిటెడ్ విశ్లేషకులు సంజయ్ మన్యాల్, కపిల్ జగసియా అభిప్రాయం వ్యక్తం చేశారు.