లొంగిపోయిన మావోయిస్ట్​ పార్టీ

లొంగిపోయిన మావోయిస్ట్​ పార్టీ
  •  ఏరియా కమిటీ మెంబర్​ బుద్ర 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : మావోయిస్ట్​ పార్టీ ఏరియా కమిటీ మెంబర్​మడవి బుద్ర అలియాస్​ కృష్ణ బుధవారం పోలీసుల ఎదుట లొంగిపోయారని ఎస్పీ బి. రోహిత్​రాజు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ 2010లో మడవి బుద్ర చర్ల–శబరి ఏరియా కమిటీలో చేరాడని, 2015 వరకు దళ సభ్యుడిగా పనిచేశారని చెప్పారు. తర్వాత ఏరియా కమిటీ మెంబర్​గా ప్రమోషన్​ పొంది పార్టీ రాష్ట్ర స్థాయిలో ప్రెస్​ టీం బాధ్యతలను నిర్వహిస్తున్నారని తెలిపారు. 

మావోయిస్టు పార్టీ కేంద్ర, రాష్ట్ర కమిటీ సభ్యులైన హరిభూషణ్​, బండి ప్రకాశ్​, దామోదర్​వంటి అగ్ర నేతల వద్ద బుద్ర పనిచేశారన్నారు. పార్టీకి చెందిన విప్లవ సాహిత్యం, ప్రెస్​నోట్లు, కరపత్రాలను తయారు చేస్తుండేవాడన్నారు. ఆపరేషన్​ చేయూతలో భాగంగా బుద్ర లొంగిపోయారని చెప్పారు. బుద్రకు ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని రకాల ఆర్థిక సాయాలు 
చేస్తామన్నారు.