- ఏరియా కమిటీ మెంబర్ బుద్ర
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : మావోయిస్ట్ పార్టీ ఏరియా కమిటీ మెంబర్మడవి బుద్ర అలియాస్ కృష్ణ బుధవారం పోలీసుల ఎదుట లొంగిపోయారని ఎస్పీ బి. రోహిత్రాజు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ 2010లో మడవి బుద్ర చర్ల–శబరి ఏరియా కమిటీలో చేరాడని, 2015 వరకు దళ సభ్యుడిగా పనిచేశారని చెప్పారు. తర్వాత ఏరియా కమిటీ మెంబర్గా ప్రమోషన్ పొంది పార్టీ రాష్ట్ర స్థాయిలో ప్రెస్ టీం బాధ్యతలను నిర్వహిస్తున్నారని తెలిపారు.
మావోయిస్టు పార్టీ కేంద్ర, రాష్ట్ర కమిటీ సభ్యులైన హరిభూషణ్, బండి ప్రకాశ్, దామోదర్వంటి అగ్ర నేతల వద్ద బుద్ర పనిచేశారన్నారు. పార్టీకి చెందిన విప్లవ సాహిత్యం, ప్రెస్నోట్లు, కరపత్రాలను తయారు చేస్తుండేవాడన్నారు. ఆపరేషన్ చేయూతలో భాగంగా బుద్ర లొంగిపోయారని చెప్పారు. బుద్రకు ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని రకాల ఆర్థిక సాయాలు
చేస్తామన్నారు.