‘టీ20 క్రికెటర్’ అవార్డు​ రేసులో సూర్య, స్మృతి

‘టీ20 క్రికెటర్’ అవార్డు​ రేసులో సూర్య, స్మృతి

దుబాయ్‌‌: ఇండియా స్టార్‌‌ బ్యాటర్లు సూర్యకుమార్‌‌ యాదవ్‌‌, స్మృతి మంధాన.. ఐసీసీ మెన్స్‌‌, విమెన్స్‌‌ ‘టీ20 క్రికెటర్‌‌ ఆఫ్‌‌ ద ఇయర్‌‌’ అవార్డులకు నామినేట్‌‌ అయ్యారు. ఈ ఏడాది సూపర్‌‌ ఫామ్‌‌లో ఉన్న సూర్యకుమార్‌‌.. షార్ట్‌‌ ఫార్మాట్‌‌లో వెయ్యి  రన్స్‌‌ చేసిన రెండో బ్యాటర్‌‌గా నిలిచాడు. ఓవరాల్‌‌గా 187.43 స్ట్రయిక్‌‌ రేట్‌‌తో 1164 రన్స్‌‌ చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, 9 హాఫ్‌‌ సెంచరీలు ఉన్నాయి.

ఐసీసీ ర్యాంకింగ్స్‌‌లో 890 రేటింగ్‌‌ పాయింట్లతో నంబర్‌‌వన్‌‌ ప్లేస్‌‌ను సాధించాడు. మెన్స్‌‌ కేటగిరీలో ఇంగ్లండ్‌‌ ఆల్‌‌రౌండర్‌‌ సామ్‌‌ కరన్‌‌, పాక్‌‌ వికెట్‌‌ కీపర్‌‌ మహ్మద్‌‌ రిజ్వాన్‌‌, జింబాబ్వే ఆల్‌‌రౌండర్‌‌ సికిందర్‌‌ రజా కూడా అవార్డు రేస్‌‌లో ఉన్నారు. విమెన్స్‌‌లో స్మృతితో పాటు నిడా డర్‌‌ (పాకిస్తాన్‌‌), సోఫీ డివైన్‌‌ (న్యూజిలాండ్‌‌), తహ్లియా మెక్‌‌గ్రాత్‌‌ (ఆస్ట్రేలియా) అవార్డు కోసం పోటీపడుతున్నారు. టీ20ల్లో 2500 రన్స్‌‌ మార్క్‌‌ను అందుకున్న స్మృతి.. ఇండియా తరఫున 23 బాల్స్‌‌లోనే హాఫ్‌‌ సెంచరీ చేసిన ప్లేయర్‌‌గా రికార్డులకెక్కింది.