
న్యూఢిల్లీ: ఇండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పోర్ట్స్ హెర్నియా ఆపరేషన్ విజయవంతంగా ముగిసింది. జర్మనీలోని మ్యూనిచ్లో ఈ సర్జరీ జరిగింది. ‘కుడి వైపు పొత్తి కడుపులో ఉన్న హెర్నియాకు డాక్టర్లు విజయవంతంగా సర్జరీ చేశారు. సున్నితమైన ఈ ఆపరేషన్ నుంచి కోలుకుంటున్నా. గ్రౌండ్లోకి తిరిగి రావడానికి వేచి చూస్తున్నా’ అని సూర్య ఇన్స్టాలో వెల్లడించాడు. ఈ ఆపరేషన్ తర్వాత రెండు వారాల్లో బెంగళూరులోని ఎన్సీఏలో రిహాబిలిటేషన్ మొదలుపెట్టనున్నాడు.
అయితే ఆగస్టులో బంగ్లాదేశ్ పర్యటనకు సూర్య అందుబాటులో ఉండే చాన్స్ ఉంది. మూడేళ్లలో సూర్యకుమార్కు ఇది మూడో సర్జరీ. 2023లో చీలమండకు ఆపరేషన్ చేయించుకున్న అతను 2024లోనూ స్పోర్ట్స్ హెర్నియాకు చికిత్స తీసుకున్నాడు. ఐపీఎల్ టైమ్లోనే హెర్నియాతో బాధపడినా ముంబై ప్లే ఆఫ్స్కు వెళ్లడంతో వాయిదా వేసుకున్నాడు.