
టీ20ల్లో సూర్యకుమార్ హవా కొనసాగుతోంది. ఏ జట్టైనా ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ఇదే క్రమంలో ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో నెంబర్ స్థానానికి చేరుకున్నాడు. అయితే ఇప్పటికే టీ20ల్లో అగ్రస్థానంలో ఉన్న సూర్యకుమార్ యాదవ్..ఇంగ్లాండ్ బ్యాట్స్ మన్ డేవిడ్ మలన్ అరుదైన రికార్డుపై కన్నేశాడు. న్యూజిలాండ్ తో జరిగే చివరి టీ20లో సూర్యకుమార్ యాదవ్ ఈ రికార్డును సాధించే అవకాశం ఉంది.
రాంచిలో జరిగిన తొలిటీ20లో సూర్యకుమార్ యాదవ్ 34 బంతుల్లో 47 పరుగులు చేయడంతో ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో సూర్య రేటింగ్ 910 పాయింట్లు సాధించాడు. అయితే రెండో మ్యాచ్ లో 31 బంతుల్లో 26 పరుగులు చేయడంతో అతను రెండు పాయింట్ల కోల్పోయి 908 రేటింగ్ పాయింట్ల వద్ద నిలిచిచాడు. ఈ క్రమంలో అహ్మదాబాద్లో జరిగే మూడో టీ20లో సూర్య చెలరేగితే కెరీర్ బెస్ట్ రేటింగ్ అందుకునే ఛాన్సుంది. 2020లో ఇంగ్లండ్ బ్యాట్స్మన్ డేవిడ్ మలన్ 915 పాయింట్లతో టీ20 ర్యాంకింగ్స్లో సత్తా చాటాడు. ప్రస్తుతం సూర్యకుమార్ పాయింట్ల రికార్డు విషయంలో మలన్ తర్వాతి స్థానంలో ఉన్నాడు. దీంతో మూడో మ్యాచ్లో సూర్యకుమార్ మరోసారి భారీ ఇన్నింగ్స్ ఆడితే మలన్ రేటింగ్ పాయింట్ల రికార్డును బద్దలు కొట్టే ఛాన్సుంది.