IPL 2024: ఢిల్లీతో మ్యాచ్‌కు సిద్ధం.. ముంబై చేరుకున్న సూర్యకుమార్ యాదవ్

IPL 2024: ఢిల్లీతో మ్యాచ్‌కు సిద్ధం.. ముంబై చేరుకున్న సూర్యకుమార్ యాదవ్

ఐపీఎల్ లో వరుస పరాజయాలు వెంటాడుతున్న ముంబై ఇండియన్స్ కు శుభవార్త అందింది. ఆ జట్టు స్టార్ ఆటగాడు, వరల్డ్ నెంబర్ వన్ బ్యాటర్ సూర్య కుమార్ యాదవ్ ముంబైకు చేరుకున్నాడు. ఐపీఎల్ లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ తో ఆదివారం (ఏప్రిల్ 7) ముంబై ఇండియన్స్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. ముంబైలోని వాంఖడే స్టేడియం ఈ మ్యాచ్ కు ఆతిధ్యమిస్తుంది. ఈ మ్యాచ్ కు సూర్యకుమార్ యాదవ్ ఆడనున్నట్లు తెలుస్తుంది. 

ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ వరుసగా మూడు మ్యాచ్ ల్లో ఓడిపోయిన సంగతి తెలిసిందే. గుజరాత్, సన్ రైజర్స్, రాజస్థాన్ రాయల్స్ తో వరుసగా ఓడిపోయిన హార్దిక్ సేన పాయింట్ల ఖాతా తెరవలేదు. మూడు నెలలకు పైగా క్రికెట్‌కు దూరమైన సూర్యకు బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ బుధవారం(ఏప్రిల్ 3) ఫిట్ గా ఉన్నట్లు సర్టిఫికెట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ తో జరగబోయే మ్యాచ్ ఆడతాడా లేదా అనే అనుమానం నెలకొన్నా.. తాజాగా ముంబై చేరుకోవడంతో సూర్య ఈ మ్యాచ్ లో ఆడటం ఖాయమైంది.      

ALSO READ :- ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ కు సీఎం రేవంత్ రెడ్డి

తొలి మూడు మ్యాచ్ ల్లో సూర్య కుమార్ యాదవ్ లేని లోటు స్పష్టంగా కనిపించింది. వరుసగా మూడు మ్యాచ్ ల్లో ఓడిపోయి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. తిలక్ వర్మ మినహాయిస్తే  ఆ జట్టులో ఎవరూ కూడా నిలకడగా రాణించడం లేదు. దీంతో సూర్య రాక ముంబై జట్టును విజయాల బాట పడుతుందేమో 
చూడాలి.