జగిత్యాల జిల్లా వాసికి కరోనా వైరస్ లక్షణాలు

జగిత్యాల జిల్లా వాసికి కరోనా వైరస్ లక్షణాలు

ప్రాణాంతక కరోనా వైరస్‌ జగిత్యాల జిల్లా వాసులను కలవర పెడుతోంది. మొన్నటి వరకు విదేశాలకే పరిమితమైన కరోనా వైరస్‌ రాష్ట్రంలో అనుమానిత కేసులు నమోదవడం, జిల్లాలో కరోనా ఛాయలంటూ పుకార్లు తలెత్తడంతో జగిత్యాల జిల్లా వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం  విదేశాల నుంచి వచ్చే వారిపై ప్రత్యేక నిఘా పెట్టింది. ఈ నేపథ్యంలో జగిత్యాల జిల్లా గోపాల్ రావు పేట గ్రామానికి చెందిన ఓ యువకుడు ఇటీవల దుబాయ్ నుంచి స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. అయితే ఆ యువకుడికి కరోనా లక్షణాలు ఉన్నాయని అనుమానం వ్యక్తం చేసిన వైద్యలు.. పరీక్షల నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.