న్యూఢిల్లీ: ఫుడ్ డెలివరీ స్టారప్ స్విగ్గీ ఈ నెల12 నుంచి బెంగళూరు, భువనేశ్వర్, విశాఖపట్నం విజయవాడ రైల్వే స్టేషన్లలో ప్రయాణికులకు ఆహారం అందించనుంది. ఫుడ్ డెలివరీ సేవలను రానున్న వారాల్లో మరో 59 రైల్వే స్టేషన్లకు విస్తరించనున్నట్లు స్విగ్గీ ఒక ప్రకటనలో తెలిపింది. రైళ్ల నుంచి ప్రీ-ఆర్డర్ చేసిన ఆహారాన్ని డెలివరీ చేయడానికి మంగళవారం స్విగ్గీ, ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది.
ఐఆర్సీటీసీ యాప్లో పీఎన్ఆర్ఎంటర్ చేసి, ఫుడ్ డెలివరీ ఇవ్వాల్సిన స్టేషన్ పేరును పేర్కొనాలి. అక్కడికి చేరుకోగానే ప్రయాణీకులు స్విగ్గీ ద్వారా ప్రీ-ఆర్డర్ చేసిన ఆహార పదార్థాలను ఇస్తారు.