- సాఫ్ట్వేర్ పవర్ హౌస్ ఇండియా.. హార్డ్వేర్ సంచలనం తైవాన్
- రెండూ కలిసి పనిచేస్తే ప్రపంచానికి చాలా ఇవ్వొచ్చు
- టీ వర్క్స్ ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్
హైదరాబాద్, వెలుగు : ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మాత్రమే కాదని.. ఇండియా, తైవాన్ కూడా అని మంత్రి కేటీఆర్ అన్నారు. సాఫ్ట్వేర్కు ఇండియా పవర్ హౌస్ అయితే.. హార్డ్వేర్సెక్టార్లో తైవాన్ సంచనాలు సృష్టిస్తోందన్నారు. ఈ రెండు దేశాలు కలిసి పనిచేస్తే ప్రపంచానికి చాలా ఇవ్వొచ్చని పేర్కొన్నారు. రాయదుర్గంలో నిర్మించిన టీ వర్క్స్ను గురువారం రాత్రి ఫాక్స్కాన్ చైర్మన్ యంగ్ల్యూతో కలిసి కేటీఆర్ ప్రారంభించారు. ఇది ఇండియాలోనే అతిపెద్ద హార్డ్వేర్ ప్రొటో టైపింగ్సెంటర్అని తెలిపారు. దీన్ని రూ.100 కోట్లతో ఏర్పాటు చేశామని వెల్లడించారు. గ్రామీణ ఆవిష్కరణలకు టీ వర్క్స్ఊతమిస్తుందన్నారు. దేశానికి ఇంత పెద్ద సెంటర్ నుఅంకితమిస్తుందన్నందుకు గర్వపడుతున్నామన్నారు. వెంటిలేటర్లు, ఎలక్ట్రిక్ వెహికల్స్, అగ్రికల్చర్ కు సంబంధించిన ఎన్నో ఆవిష్కరణలకు టీ వర్క్స్ అండగా నిలిచిందన్నారు. గ్రామీణ యువత సృజనాత్మక ఆలోచనలకు మరింత పదును పెట్టి వారి ఆవిష్కరణలను సాకారం చేసిన ఘనత టీ వర్క్స్దే అని చెప్పారు. తెలంగాణలో ఫాక్స్కాన్ యూనిట్స్థాపించి లక్ష ఉద్యోగాలు కల్పిస్తామన్న యంగ్ ల్యూకు కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగ నియామకాల్లో తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా ఉద్యమించి ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నామని, ఈరోజు ఫాక్స్కాన్లాంటి సంస్థలతో లక్షలాది మంది యువతకు ఉద్యోగాలు లభించడం హర్షణీయమన్నారు. ఫాక్స్కాన్తో ఈ సంబంధాలు సుదీర్ఘకాలం కొనసాగిస్తామన్నారు. అతి చిన్న దేశమైన తైవాన్ అభివృద్ధిలో ఎక్కడో ఉందని, హైదరాబాద్ను ఇండియాలో షాంజైన్ గా మార్చగలమన్న నమ్మకం తమకు ఉందన్నారు.
టీవర్క్స్తో కలిసి పనిచేస్తం: ఫాక్స్కాన్ చైర్మన్
గత ఏడేళ్ల కాలంలో తెలంగాణ అద్భుతమైన ప్రగతిని సాధించిందని, ఈ అభివృద్ధి తనను ఆశ్చర్యానికి గురి చేసిందని ఫాక్స్కాన్ చైర్మన్ యంగ్ల్యూ అన్నారు. ఇదే వేగంతో పనిచేస్తే నాలుగేళ్లలోనే ఎకానమీ డబుల్ అవడం ఖాయమన్నారు. టీవర్క్స్ కాన్సెస్ట్అద్భుతమైనదని, దీనితో ప్రజలు ఎంతో చేసే అవకాశం ఉంటుందన్నారు. హై ఎండ్ ఎలక్ట్రిక్సర్క్యూట్ బోర్డుల అసెంబ్లింగ్ కోసం, సర్ఫేస్ మౌంట్ టెక్నాలజీ (ఎస్ఎంటీ)లో టీవర్క్స్తో ఫాక్స్కాన్ కలిసి పనిచేస్తుందని వెల్లడించారు. టీవర్క్స్తో దేశంలో పారిశ్రామిక విప్లవానికి పునాది వేశామని టీవర్క్స్ సీఈవో సుజయ్ కారంపూడి అన్నారు. ఇది ఒక బిల్డింగ్ మాత్రమే కాదని, 60 సభ్యులతో కూడిన స్ట్రాంగ్ టీం తమ సొంతమన్నారు. 300కు పైగా స్టార్టప్స్ టీ వర్క్స్తో కలిసి పనిచేస్తున్నాయని ఐటీ శాఖ ప్రిన్సిపల్సెక్రటరీ జయేశ్రంజన్ తెలిపారు. కాగా, టీ వర్క్స్ ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన లేజర్ షో అందరినీ ఆకట్టుకుంది. కార్యక్రమంలో ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ తదితరులు పాల్గొన్నారు.