
కరోనా వైరస్ వ్యాపిస్తుందనగా తబ్లిగీ సమావేశాలను ఆపేయాలని ఆసంస్థ చీఫ్ మౌలానా మహమ్మద్ సాద్ కంధ్లావిని కోరినట్లుగా చెప్పారు ఆయన సహాచరులు. అయితే చెప్పినా వినకుండా మౌలానా మహమ్మద్ సాద్ సమావేశాలను కొనసాగించారని తెలిపారు. అయితే ఆయన చేసిన పనికి మతసమావేశానికి వచ్చిన ప్రతీవారు బాధపడుతున్నారని ఆయన సహాచరులలోని ఒకతను మీడియాకు చెప్పారు. మర్కజ్కు అటెండ్ అయిన వారిలో 1000మందికి కరోనా సోకిందని ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం మౌలానా తన సన్నిహిత అనుచరులతో కలిసి అజ్ఞాతంలో ఉన్నాడు. దేశంలో నమోదైన కేసులలో 30శాతం మంది, ఉత్తర ప్రదేశ్ కేసులలో 50శాతం మంది జమాత్లో పాల్గొన్నవారే ఉన్నారు.
తబ్లిగీకి చెందిన మౌలానా ఆలం అనే అతను మీడియాతో మాట్లాడుతూ మౌలానా మహమ్మద్ సాద్ కు అన్నీ తెలిసే చేశాడని అన్నాడు. అతని మొండి వైఖరి పరిస్థితులను కఠినం చేశాయని చెప్పాడు. తాము ఎంత చెప్పినా సాద్ వినలేదని అన్నాడు. అయితే మరికొందరు తబ్లిగీకి చెందిన వాళ్లు మాట్లాడుతూ తాము ప్రభుత్వ అనుమతితోనే సభలు పెట్టుకున్నామని అన్నారు.