మానవత్వం చాటుకున్న తొర్రూర్​ తహసీల్దార్

మానవత్వం చాటుకున్న తొర్రూర్​ తహసీల్దార్
  • స్లాట్ బుక్​ చేసుకున్న పేషెంట్ దగ్గరికి వెళ్లి రిజిస్ట్రేషన్

హైదరాబాద్ : పైసలు ఇయ్యనిదే పని కాదనే అపవాదు ఉన్న రెవెన్యూ శాఖలో..  ఓ తహసీల్దార్ మానవత్వం చాటుకొని రెవెన్యూ అధికారులకు ఆదర్శంగా నిలిచారు. తల్లిదండ్రులను కోల్పోయి అనారోగ్యంతో హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్న ఓ యువతి పేరిట ల్యాండ్​ విరాసత్ చేసేందుకు రెవెన్యూ సిబ్బందే 150 కిలోమీటర్ల దూరం వెళ్లారు. మహబూబాబాద్ జిల్లా మడిపల్లెకు చెందిన లోకుంట్ల పూజ తల్లిదండ్రులు కొంతకాలం కింద టీబీతో చనిపోయారు. పూజ కూడా ఇదే వ్యాధితో బాధపడుతోంది. ఆమెకు స్థానికంగా సర్వే నంబర్ 548/7/3/1/1లోని ఎకరంన్నర భూమి వారసత్వంగా వచ్చింది.

తండ్రి పేరిట ఉన్న భూమిని ఆమె పేరిట విరాసత్ చేసేందుకు జిల్లా కలెక్టర్ సక్షేషన్​ ఆర్డర్స్ ఇవ్వగా ధరణిలో ఇటీవల ఆమె సక్సేషన్ ​రిజిస్ట్రేషన్​ చేయించుకునేందుకు స్లాట్​బుక్ ​చేసుకుంది. కానీ ప్రస్తుతం ఆమె హైదరాబాద్ లోని ఎర్రగడ్డ టీబీ హాస్పిటల్ లో ట్రీట్​మెంట్ తీసుకుంటోంది. స్లాట్​ప్రకారం జూన్1న తహసీల్దార్ ​ఆఫీసుకు వెళ్లలేకపోయింది. విషయం తెలుసుకున్న తొర్రూరు తహసీల్దార్​ వేమిరెడ్డి రాఘవరెడ్డి జిల్లా కలెక్టర్, తొర్రూర్​ ఆర్డీవో అనుమతితో హైదరాబాద్ కు తన సిబ్బందితో వచ్చి హాస్పిటల్ లోనే బయోమెట్రిక్​ తీసుకుని సక్సేషన్​ రిజిస్ట్రేషన్​ ద్వారా అక్కడికక్కడే ఈ– పట్టా జారీ చేశారు. 

మరిన్ని వార్తల కోసం : -

డాక్టర్ నిర్లక్ష్యం: బతికుండగానే డెత్ సర్టిఫికెట్


ఉపాధి హామీతో పేదలకు మేలు