
తైపీ: ఇండియా డబుల్స్ స్టార్ ప్లేయర్లు సిక్కి రెడ్డి–రోహన్ కపూర్ జోడీ.. తైపీ ఓపెన్లో బోణీ చేశారు. బుధవారం జరిగిన మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో సిక్కి రెడ్డి-–రోహన్ కపూర్ 21–-14, 21–-17తో ఇండియాకే చెందిన నవనీత్–-ప్రియపై నెగ్గి ప్రిక్వార్టర్స్లోకి ప్రవేశించారు. మెన్స్ సింగిల్స్లో క్వాలిఫయర్ కశ్యప్ 21–15, 21–16తో శామ్యూల్ హియావో (జర్మనీ)పై, థర్డ్ సీడ్ హెచ్ఎస్ ప్రణయ్ 21–11, 21–10తో లిన్ యు సియెన్ (చైనీస్తైపీ)పై నెగ్గారు. ఇతర మ్యాచ్ల్లో మిథున్ మంజునాథ్, శంకర్ ముత్తుస్వామి, కిరణ్ జార్జ్ ఓడిపోయారు.