- ఇరిగేషన్ శాఖకు కేంద్ర పర్యావరణ శాఖ ఆదేశం
హైదరాబాద్, వెలుగు: పర్యావరణ అనుమతులు లేకుండా సీతమ్మ సాగర్మల్టీ పర్పస్ప్రాజెక్టు పనులు చేపట్టిన కొత్తగూడెం సీఈపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్డిపార్ట్మెంట్కు కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఆ శాఖ సైటింస్ట్డాక్టర్సౌరభ్ఉపాధ్యాయ్ ఇటీవల ఇరిగేషన్శాఖ సెక్రటరీకి ఈ మేరకు లేఖ రాశారు. ఈ ప్రాజెక్టు పనులకు బాధ్యుడైన కొత్తగూడెం సీఈపై చర్యలు తీసుకునేలా చూడాలని, తీసుకున్న చర్యల సమాచారం తమకు అందజేయాలని తెలంగాణ పొల్యూషన్కంట్రోల్బోర్డు మెంబర్సెక్రటరీకి మరో లేఖ రాశారు.
పర్యావరణ అనుమతులు లేకుండానే సీతమ్మ సాగర్మల్టీపర్పస్ప్రాజెక్టు పనులు చేస్తున్నారని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన తెల్లం నరేశ్తో పాటు మరికొందరు ఎన్జీటీని ఆశ్రయించారు. సీతారామ లిఫ్ట్స్కీంలో అంతర్భాగంగా ఈ ప్రాజెక్టును చూపించి తెలంగాణ పర్యవరణ అనుమతులు పొందే ప్రయత్నం చేయగా దానికి కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఎక్స్పర్ట్అప్రైజల్కమిటీ (ఈఏసీ) ససేమిరా అంది. సీతమ్మసాగర్కు విడిగా పర్యావరణ అనుమతులు తీసుకోవాల్సిందే, అప్పటి వరకు పనులు నిలిపివేయాలని ఆదేశించారు.
ఎన్జీటీ సైతం ఇదే తరహా ఆదేశాలు ఇచ్చింది. ఎన్జీటీ ఆదేశాలను ధిక్కరించి ఇరిగేషన్ఇంజనీర్లు సీతమ్మ సాగర్ పనులు కొనసాగించారు. ఈ నేపథ్యంలో పిటిషనర్లు మళ్లీ ఎన్జీటీని ఆశ్రయించారు. సీతమ్మ సాగర్పనులను వెంటనే నిలిపి వేయడంతో పాటు ఈ పనులకు బాధ్యుడైన ప్రాజెక్టు అథారిటీ (కొత్తగూడెం) సీఈపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇరిగేషన్డిపార్ట్మెంట్చర్యలు తీసుకున్నాదో లేదో పరిశీలించి తమకు సమాచారం ఇవ్వాలని పొల్యూషన్కంట్రోల్బోర్డుకు ఆదేశాలు ఇచ్చారు.