మూడో చిత్రానికి శ్రీకారం

మూడో చిత్రానికి శ్రీకారం

తమిళ హీరోలు తెలుగులో స్ట్రెయిట్ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ లిస్ట్‌‌లో అందరికంటే ముందున్నాడు ధనుష్. ఇప్పటికే తెలుగులో రెండు సినిమాలు చేస్తున్న ధనుష్.. మరో కొత్త సినిమాకు కమిట్ అవబోతున్నట్టు తెలుస్తోంది. దిల్‌‌ రాజు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి డైరెక్షన్‌‌లో ‘వారసుడు’ సినిమాను నిర్మించిన ఆయన, తన తర్వాతి చిత్రం ధనుష్‌‌తో చేయబోతున్నట్టు తెలుస్తోంది. శర్వానంద్ హీరోగా ‘శ్రీకారం’ సినిమా తీసిన కిషోర్ రెడ్డి దీన్ని డైరెక్ట్ చేయనున్నాడట. ఇప్పటికే ధనుష్‌‌ ఈ స్టోరీ లైన్‌‌కి గ్రీన్ సిగ్నల్‌‌ ఇవ్వడంతో, ప్రీ ప్రొడక్షన్‌‌ వర్క్స్ జరుగుతున్నట్టు టాక్.

‘వారసుడు’ సినిమా సంక్రాంతికి రిలీజ్ కానుండగా... ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్‌‌పై అఫీషియల్ అనౌన్స్‌‌మెంట్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ధనుష్ హీరోగా వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తున్న ‘సార్‌‌‌‌’ సినిమా ఫిబ్రవరి 17న రిలీజ్ కానుంది. మరోవైపు శేఖర్ కమ్ముల డైరెక్షన్‌‌లోనూ ఓ సినిమా చేస్తున్నాడు ధనుష్. దీంతో కిషోర్‌‌‌‌ డైరెక్ట్ చేయబోయే చిత్రం ధనుష్‌‌కి తెలుగులో మూడో సినిమా కానుంది.