తమిళనాడులోని చెన్నైలో భారీ ప్రమాదం జరిగింది. డిసెంబర్ 26 రాత్రి ఎన్నూర్లోని సబ్ సీ పైపులో అమ్మోనియా గ్యాస్ కలకలం రేపింది. ఈ ఘటన వల్ల సమీపంలో ఉండే పెరియ కుప్పం గ్రామస్తులు 25 మందికి పైగా ఆస్పత్రి పాలయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, పలువురు అధికారులు బాధితులను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు.
ఎన్నూర్ ఎరువుల యూనిట దగ్గర ప్రస్తుతం ఎలాంటి గ్యాస్ లీకేజీలు లేవని సిబ్బంది సమస్యను సరిదిద్దారని ఆవడి జాయింట్ కమిషనర్ విజయకుమార్ చెప్పారు. మరో వైపు స్థానికులు ఈ ఘటపై నిరసనకు దిగారు. ఎరువుల యూనిట్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భారీగా మోహరించారు పోలీసులు
#WATCH | Tiruvallur, Tamil Nadu: People hold protest after Ammonia gas leak was detected in a sub-sea pipe in Ennore.
— ANI (@ANI) December 27, 2023
According to DIG, Joint Commissioner Avadi, Vijayakumar, there are no more gas (ammonia) leaks at Ennore. People are back home. Medical and police teams are… pic.twitter.com/APYymkgY6X