భోపాల్ గుర్తుకొచ్చింది : చెన్నైలో అర్థరాత్రి అమ్మోనియం గ్యాస్ లీక్.. కుప్పకూలిన జనం

భోపాల్ గుర్తుకొచ్చింది : చెన్నైలో అర్థరాత్రి అమ్మోనియం గ్యాస్ లీక్.. కుప్పకూలిన జనం

తమిళనాడులోని  చెన్నైలో భారీ ప్రమాదం జరిగింది. డిసెంబర్ 26 రాత్రి ఎన్నూర్‌లోని సబ్ సీ పైపులో అమ్మోనియా గ్యాస్ కలకలం రేపింది.  ఈ  ఘటన వల్ల సమీపంలో ఉండే పెరియ కుప్పం గ్రామస్తులు 25 మందికి పైగా ఆస్పత్రి పాలయ్యారు.   ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, పలువురు అధికారులు బాధితులను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. 

ఎన్నూర్ ఎరువుల యూనిట  దగ్గర ప్రస్తుతం ఎలాంటి  గ్యాస్ లీకేజీలు లేవని సిబ్బంది సమస్యను సరిదిద్దారని   ఆవడి జాయింట్ కమిషనర్ విజయకుమార్  చెప్పారు.  మరో వైపు స్థానికులు ఈ ఘటపై నిరసనకు దిగారు.  ఎరువుల యూనిట్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భారీగా మోహరించారు పోలీసులు