పని చేయకపోవడంలో కాంగ్రెస్ చాలా ఎక్స్ పర్ట్

పని చేయకపోవడంలో కాంగ్రెస్ చాలా ఎక్స్ పర్ట్

మధురై: కాంగ్రెస్ పాలనలో జరిగిన అభివృద్ధి శూన్యమని, ఆ పార్టీ పని చేయకపోవడంలో చాలా నిపుణత సాధించిందని ప్రధాని మోడీ విమర్శించారు. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోడీ.. డీఎంకే, కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం చాలా వెనుకబడిందన్నారు. తమిళనాడు డెవలప్మెంట్ ఎన్డీయే కూటమితోనే సాధ్యమన్నారు. 'కాంగ్రెస్-డీఎంకే కూటమి వల్ల తమిళనాడుకు ఒరిగిందేమీ లేదు. ఈ కూటమి మహిళలను అవమానించింది. ఒకవేళ వీళ్లు పవర్ లోకి వస్తే శాంతి భద్రతలకు తీవ్ర విఘాతం కలుగుతుంది. కాబట్టి మార్పు రావాలంటే మాకు ఓటెయ్యండి' అని మోడీ కోరారు.