చెన్నై: తమిళనాడు చీఫ్ మినిస్టర్ పళనిస్వామి ప్రైవేట్ సెక్రటరీ బీజే దామోదరన్ (56) కరోనాతో చనిపోయారు. వారం క్రితం దగ్గు, జలుబు, జ్వరంతో ఓ ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ దామోదరన్కు కరోనా టెస్టులు చేయడంతో పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయనను స్పెషల్ హాస్పిటల్కు తరలించి ట్రీట్మెంట్ చేశారు. అక్కడ పరిస్థితి విషమించి బుధవారం చనిపోయారు. సీఎంఓలో ఐఏఎస్లతో కలిసి మొత్తం 200 వరకు సిబ్బంది పనిచేస్తున్నారు. ప్రస్తుతం వీరిందరికీ కరోనా టెస్టులు చేస్తున్నారు. ఆఫీస్ను తాత్కాలికంగా మూసివేసి శాటిటేషన్ చేస్తున్నారు. దామోదరన్ మృతికి పళనిస్వామి సంతాపం తెలిపారు. ఫ్యామిలీ మెంబర్స్లో ఒకరికి గవర్నమెంట్ ఉద్యోగమిస్తామని ప్రకటించారు.
ఢిల్లీ హెల్త్ మినిస్టర్కు పాజిటివ్
ఢిల్లీ హెల్త్ మినిస్టర్ సత్యేందర్ జైన్కు కరోనా పాజిలివ్ వచ్చింది. జ్వరం ఎక్కువగా ఉండడంతో ఆయనకు బుధవారం రెండోసారి టెస్ట్చేశారు. మంగళవారం ఆయనకు నెగిటివ్ అని తేలింది.
ఆప్ ఎమ్మెల్యే అతీషికి కూడా
ఆప్ ఎమ్మెల్యే, ఆ పార్టీ జాతీయ కార్యదర్శి అతీషికి కరోనా పాజిటివ్తేలింది. దగ్గు, జ్వరం లాంటి లక్షణాలు ఉండడంతో రెండు రోజుల కిందట ఆమె కరోనా టెస్ట్ చేయించుకోగా బుధవారం రిపోర్ట్ వచ్చింది. ప్రస్తుతం ఆమె హోమ్ క్వారంటైన్లో ఉన్నారు. కరోనా కట్టడి కోసం అతీషి తీవ్రంగా శ్రమిస్తున్నారని, ఆమె త్వరగా కోలుకోవాలని సీఎం కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.